ముందుగా మీకు
శుభాకాంక్షలు . ఎందుకంటే వేల మందిలో ఒక్కరూ మాత్రమే పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు . అట్లా ప్రయత్నించువారిలో కూడా ఒక్కరు మాత్రమే మత్పరాయనుడై శ్రీ కృష్ణుని తత్వమును తెలుసుకుంటారు .
ఈ విషయమును శ్రీ కృష్ణ భగవానుడు 7 వ ఆద్యాయము లోని 3 వ శ్లోకం లో చెబుతాడు. కనుక ప్రయత్న పూర్వకముగా భాగవద్గీతను నేర్చుకోవడానికి ఈ వెబ్సైట్ చూశారంటే , మీకు శ్రీ కృష్ణుని అనుగ్రహం కలిగినట్లే .
ఇది
సత్యం సత్యం సత్యం.
శ్రీ కృష్ణ పరమాత్మ దేవాది దేవుడు . ఆది గురువు . ఈ చరాచర సృష్టికర్త .
త్రిమూర్తులను కూడా ఆయనే సృష్టించాడు . విశ్వరూపాన్ని చూసినట్లైతే శివుడు , విష్ణువు చెరోకవైపు , బ్రహ్మ హృదయములో కనిపిస్తారు .
విష్ణుమూర్తి కృష్ణుని యొక్క ప్రధాన అంశ .
ఈ జగత్తు మొత్తానికి ఆయనే ఆది గురువు అందుకే "కృష్ణం వందే జగద్గురుం" అంటారు .
ఆయనకు మించిన గురువు వేరెవరు లేరు .
శ్రీ కృష్ణుడు స్వయముగా ఉపదేశించిన మహత్గ్రంధం
"భగవద్గీత"
కనుక మానవుడనే ప్రతి ఒక్కడూ భగవద్గీత ను అర్ధవంతంగా నేర్చుకోవాలి .
అందుకు గాను సులువుగా నేర్చుకోవడానికి ప్రతీ శ్లోకము విడి విడిగా రికార్డు చేయబడినది . నేర్చుకోదలచిన శ్లోకము కొన్నిసార్లు
వింటూ చదివితే ఖంటస్తం అవుతుంది .
ఎలా చదవాలి అని తెలుసుకోవడానికి
ఇక్కడ క్లిక్ చేయండి .
నేర్చుకోవడం ప్రారంబించడానికి
ఇక్కడ క్లిక్ చేయండి .
శ్రీకృష్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు ..